దేశ ప్రజలకు ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలు

దేశ ప్రజలకు ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండుగ సందర్భంగా ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపాల పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, మంచి ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈ పవిత్రమైన వెలుగు, ఆనందాల పండుగ రోజున జ్ఞానం, శక్తి  అనే దీపాన్ని వెలిగించి దీనుల జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావడానికి ప్రయత్నిద్దామని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఈ గొప్ప పండుగ రోజున దేశప్రజలందరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానన్నారు. 

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపాల ఉత్సవం అజ్ఞాన తిమిరాలను పారద్రోలి ప్రపంచ ప్రజలకు జ్ఞానాన్ని, సంతోషాన్ని, శ్రేయస్సును, శాంతిని ప్రసాదించాలని, ప్రభావవంతమైన రేపటి దిశగా సమాజాన్ని జాగృతం చేయాలని ఆకాంక్షిస్తున్నానంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.