సహజంగా కోర్టుకు పోలీసులు.. లాయర్లు... నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు.. న్యాయం కావలసిన వారు వస్తుంటారు. కాని హరిద్వార్లోని ఓ కోర్టుకు ఏకంగా వినాయకుడు వచ్చాడట. అదేనండి వినాయకుడు అంటే ఏనుగు అన్నమాట. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఏనుగు హల్చల్ చేసింది. కోర్టు ఆవరణలోకి వచ్చిన ఏనుగు అక్కడున్న కోర్టు గేట్లను తోసేసి, ప్రాంగణంలోకి ప్రవేశించింది. హరిద్వార్ కోర్టు ఆవరణలో ఏనుగు ప్రధాన గేటును బద్దలు కొట్టి ప్రవేశించడంతో గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఇక ఏనుగు కోర్టు లోపలికి వచ్చేందుకు యత్నించగా, అక్కడున్న కోర్టు సిబ్బంది, లాయర్లు ఆందోళనకు గురయ్యారు. ఏనుగును అక్కడ్నుంచి పంపించేందుకు గట్టిగట్టిగా అరుపులు కేకలు వేస్తూ హడావుడి చేశారు. అయినప్పటికీ ఏనుగు కోర్టు గేట్లను తోసి లోపలికి వచ్చింది. ఈ ఏనుగు హరిద్వార్కు సమీపంలో ఉన్న రాజాజి టైగర్ రిజర్వ్ నుంచి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో అడవుల్లో ఉండాల్సిన జంతువులు తరచూ జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. జింకలు, ఏనుగులు, పులులు వంటివి అనేక రకాల జంతువులు పట్టణాలు, గ్రామాలపై పడి జనాల్ని భయంభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి సంఘటనలో ఒక ఏనుగు కోర్టు ఆవరణలోకి ప్రవేశించింది. జనావాసాల్లో ప్రత్యక్షమైన గజరాజును చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కోర్టు గేట్లను తోసుకుంటూ వచ్చిన ఏనుగు అక్కడ కాసేపు హల్చల్ చేసింది. కోర్టు లోపలికి కూడా ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఏనుగు వీరంగంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ వార్తకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Meet the unexpected 'guest' in Haridwar court. ?
— editorji (@editorji) December 28, 2023
The wild elephant rammed down its gate, creating chaos as it traversed the district magistrate's office and the court premises. It is believed to have snuck out of the nearby Rajaji Tiger Reserve.#Uttarakhand #Haridwar… pic.twitter.com/00RzrF9d1q