పంజాబ్లోని లూథియానా జిల్లా సెంట్రల్ జైల్లో పోలీసు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో చెప్పే్ందుకుఈ ఒక్క వైరల్ వీడియో ఒకటి చాలు.. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ మణి రాణా పుట్టినరోజును ఖైదీలు మందు విందుతో చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. ఖైదీలు ప్లేట్లు పట్టుకుని పొడవాటి వరుసలో కూర్చున్నారు. అంతేకాకుండా దీన్నంతా ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇదంగా 15 రోజుల క్రితం జరిగింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో... ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ 15 మంది ఖైదీలపై కేసు నమోదు చేసింది. ఇలాంటి ఘటనలు మొదటిసారి కాదు. గతంలో కూడా చోటుచేసుకున్నాయి.
A video of celebrating a birthday in #Ludhiana's Central Jail has surfaced on social media. Jail inmates are celebrating the birthday of Mani Rana, who is in jail with them. Taking cognizance of the video, the police have registered a case against some inmates in jail. pic.twitter.com/UQQMfjVnYB
— Nikhil Choudhary (@NikhilCh_) January 4, 2024
గతంలో కూడా ఇదే తరహాలో జైలులో బర్త్డే పార్టీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో జైలు అధికారులపై పలు ఆరోపణలు వచ్చాయి. గతేడాది జూన్లో అమన్ కుమార్ అనే అండర్ట్రయిల్ తన స్నేహితుడి పుట్టినరోజును ఫిరోజ్పూర్ సెంట్రల్ జైలు లోపల నుండి ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. ఈ వ్యవహారంపై అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.