న్యూఢిల్లీ: కెనడా కంపెనీ ఫెయిర్ఫాక్స్ గ్రూప్కు చెందిన గో డిజిట్ ఈ నెల 15న ఇన్వెస్టర్ల ముందుకొస్తోంది. కంపెనీ ఐపీఓ మే 17న ముగుస్తుంది. మే 14న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్స్ ఓపెన్ చేస్తారు. ఈ కంపెనీలో క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ ఇన్వెస్ట్ చేశారు.
కానీ, ఐపీఓలో వీరు తమ షేర్లను అమ్మడం లేదు. గో డిజిట్ ప్రమోటర్ గో డిజిట్ ఇన్ఫోవర్క్స్ సర్వీసెస్, ఇతర షేర్ హోల్డర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద రూ.1,125 కోట్ల విలువైన 5.47 కోట్ల షేర్లను అమ్ముతున్నారు. గో డిజిట్ మోటార్, హెల్త్, ట్రావెల్, ప్రాపర్టీ వంటి ఇన్సూరెన్స్లను అమ్ముతోంది.