లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా వీరేంద్ర కుమార్

లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా వీరేంద్ర కుమార్

లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా వీరేంద్ర కుమార్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో వీరేంద్ర కుమార్ తో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. ఏడు సార్లు ఎంపీగా గెలిచి అందరికంటే సీనియర్ అయిన వీరేంద్ర కుమార్ ప్రొటెం స్పీకర్ గా ఎంపికయ్యారు. లోక్ సభలో ఎంపీలందరితో వీరేంద్ర కుమార్ ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ, సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మరికొందరు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.