
డిఫరెంట్ కాన్సెప్టులతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్.. కీలక నిర్ణయంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ‘మెట్రో రెట్రో’ పేరిట అవయవ దానంపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై.. మరణానంతరం తాను ఆర్గాన్స్ డొనేట్ చేయనున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు తన వ్యక్తిగత విషయాలను తెలియజేసి ‘డోనర్ కార్డ్’ను అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని, అనేక మంది ప్రాణాలను కాపాడాలని విశ్వక్ కోరాడు. ఆయన నిర్ణయం పట్ల ఫ్యాన్స్, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విశ్వన్సేన్తో దర్శకుడు శైలేష్ కొలను పాల్గొన్నాడు. మరోవైపు విశ్వక్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’తో పాటు మరో మూడు చిత్రాలకు కమిట్ అయ్యాడు.