కెరీర్ ప్రారంభించి ఇరవయ్యేళ్లు దాటినా.. ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్తో స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతోంది త్రిష. స్టార్ హీరోలందరితోనూ స్ర్కీన్ షేర్ చేసుకున్న ఎక్స్పీరియెన్స్ ఆమెకుంది. మెగాస్టార్ చిరంజీవితోనూ త్రిష నటించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల క్రితం ‘స్టాలిన్’ చిత్రంతో మెప్పించిన ఈ జంట మరోసారి స్ర్కీన్పై కనిపించనున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి రూపొందిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తుంది.
కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న ఈ న్యూస్ దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో వేసిన స్పెషల్ సెట్లో జరుగుతోంది. ఈ నెల 9 నుంచి సాంగ్ షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్లోనే త్రిష జాయిన్ కానుందట. ఫాంటసీ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు రీసెంట్గా ప్రకటించారు.