హైదరాబాద్‌‌‌‌లో కీలక షెడ్యూల్‌‌‌‌ను పూర్తి చేసుకున్న విశ్వంభర టీమ్

హైదరాబాద్‌‌‌‌లో కీలక షెడ్యూల్‌‌‌‌ను పూర్తి చేసుకున్న విశ్వంభర టీమ్

చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట రూపొందిస్తున్న సోషీయో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. త్రిష హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.  తాజాగా హైదరాబాద్‌‌‌‌లో ఓ కీలక షెడ్యూల్‌‌‌‌ను పూర్తి చేశారు.  చిరంజీవి, త్రిషతో పాటు ఇతర నటీనటులు ఈ షెడ్యూల్‌‌‌‌లో పాల్గొన్నారు.  

కొన్ని టాకీ పార్ట్స్, పాట, యాక్షన్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ని  చిత్రీకరించినట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా టీమ్ అంతా కలిసున్న ఫొటోను షేర్ చేశారు. అలాగే  చిరంజీవి, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో కలిసున్న ఫొటోను త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసి సంతోషం వ్యక్తం చేసింది. ఇందులో చిరంజీవి డ్యూయెల్ రోల్ చేస్తున్నారని, అందులో ఒకటి యంగ్‌‌‌‌ లుక్‌‌‌‌ కాగా, వయసు పైబడిన మరో పాత్రలో  కూడా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సురభి, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, ప్రవీణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కానుంది.