హైదరాబాద్ సెక్రటేరియట్ కు క్యూ కట్టిన విజిటర్స్

హైదరాబాద్ సెక్రటేరియట్ కు క్యూ కట్టిన విజిటర్స్

హైదరాబాద్ సెక్రటేరియట్ కు సోమవారం రోజు (జులై 24న) విజిటర్లు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నిన్నటి (జులై 23)తో సెలవులు ముగియడంతో సోమవారం (జులై 24) సెక్రటేరియట్ కు జనం బారులు తీరారు. ప్రభుత్వ పథకాలు, వివిధ సమస్యల పరిష్కారం కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పథకాలకు సంబంధించి అధికారులను, మంత్రులను కలిసేందుకు వస్తున్నారు. అందరూ ఒకేరోజు, ఒకేసారి రావడంతో సెక్రటేరియట్ లో కొంత గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. 

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాష్ర్ట ప్రభుత్వం కూడా కొత్త కొత్తపథకాలను ప్రకటిస్తోంది. దీంతో సంబంధిత అధికారులు, మంత్రులను కలిసేందుకు వస్తున్నామని చెబుతున్నారు జనం. నాలుగు రోజులు సెలవులు ఉండడంతో సెక్రటేరియట్ కు రాలేదంటున్నారు. 4 రోజుల తర్వాత సెక్రటేరియట్ కు పెద్ద సంఖ్యలో జనం వస్తుండడంతో వారికి పాస్ లు ఇచ్చి.. లోపలికి పంపిస్తున్నారు. పాసులు తీసుకుని లోపలి వెళ్తున్న వారితో దాదాపు మూడు, నాలుగు క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.