
రాష్ట్ర చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్య వైభవంపై ప్రచారం చేసేందుకు.. ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి సంయుక్తంగా తెలంగాణ వైభవం కార్యక్రం నిర్వహిస్తున్నాయి. ఈ నెల 20 నుంచి 22 వరకు 3 రోజుల పాటు కరీంనగర్ లో ఈ ప్రోగ్రాం జరగనుంది. ఇప్పటికే వీ6 చానెల్ ద్వారా రాష్ట్ర చరిత్ర తెలిసేలా ప్రత్యేక కార్యక్రమం చేస్తున్నామన్నారు బీజేపీ నేత వివేక్. వెలుగు పత్రిక ద్వారా కూడా ప్రజల్లోకి రాష్ట్ర చరిత్ర తీసుకెళ్తామని చెప్పారు.