సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వెలిమల గ్రామంలో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అనంత పద్మనాభ స్వామి వారి కళ్యాణోత్సవంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
వెలిమల గ్రామానికి తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వివేక్ వెంకటస్వామి అన్నారు. వెలిమల గ్రామానికి తాను ఎంతో రుణపడి ఉంటానని చెప్పారు. తన ఇండస్ట్రియల్ కెరియర్ వెలిమల గ్రామంలోనే మొదలయ్యిందని గుర్తు చేశారు. మొట్టమొదటగా విశాఖ ఇండస్ట్రీస్ ఇక్కడే స్టార్ట్ చేశామన్నారు. వెలిమల ప్రజలు, సర్పంచ్ తమ కంపెనీకి పూర్తిగా సహకరించారని తెలిపారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. కంపెనీ స్థాపించినప్పుడు ఇక్కడ రోడ్డు కూడా సరిగ్గా లేవని.. అయిన కార్మికులు కంపెనీ కోసం కష్టపడి పని చేశారన్నారు. వెలిమల గ్రామ ప్రజలతో పాటు.. చుట్టు గ్రామాల ప్రజలూ తమ కంపెనీకి సహకరిస్తున్నారని వివేక్ వెంకటస్వామి చెప్పారు.