
– హైదరాబాద్, వెలుగు : ఎయిర్ ఏషియా విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్కు తిరిగి విమానాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నానికి డైరెక్ట్ ఫ్లైట్ సేవలు అందిస్తున్న ఏకైక విమానయాన సంస్థ తామేనని తెలిపింది. ఎయిర్ఏషియా 2024 ఏప్రిల్ 26 నుంచి విశాఖపట్నం నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్కు వారానికి మూడు సార్లు విమానాలను నడపబోతుంది. విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్కి 14 ఫిబ్రవరి వరకు కేవలం రూ4,999 ప్రారంభ ధరతో టికెట్ బుక్ చేసుకోవచ్చు.