వైజాగ్–కౌలాలంపూర్​ ఫ్లైట్ ​మళ్లీ షురూ 

వైజాగ్–కౌలాలంపూర్​ ఫ్లైట్ ​మళ్లీ షురూ 

– హైదరాబాద్​, వెలుగు : ఎయిర్ ​ఏషియా విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్‌‌‌‌కు తిరిగి విమానాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నానికి డైరెక్ట్ ఫ్లైట్ సేవలు అందిస్తున్న ఏకైక విమానయాన సంస్థ తామేనని తెలిపింది. ఎయిర్​ఏషియా 2024 ఏప్రిల్ 26 నుంచి విశాఖపట్నం నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్‌‌‌‌కు వారానికి మూడు సార్లు విమానాలను నడపబోతుంది.  విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్‌‌‌‌కి  14 ఫిబ్రవరి  వరకు కేవలం రూ4,999 ప్రారంభ ధరతో టికెట్​ బుక్ చేసుకోవచ్చు.