
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మరో 80 సర్కారీ స్కూళ్లలో ఒకేషనల్ విద్య స్టూడెంట్లకు అందుబాటులోకి రానుంది. ఈ విద్యాసంవత్సరం నుంచే 66 కేజీబీవీలతో పాటు14 సొసైటీ గురుకులాల్లో దీనిని ప్రారంభించేందుకు సర్కారు అనుమతించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. 2023–24 పీఏబీలో ఆమోదం మేరకు ఆయా స్కూళ్లను ఎంపిక చేసినట్టు తెలిపారు. నైన్త్ తో పాటు ఇంటర్ ఫస్టియర్ లోను ఈ క్లాసులు ప్రారంభిస్తారు. వచ్చే ఏడాది టెన్త్, ఇంటర్ సెకండియర్ లోకూడా ఇవి కొనసాగుతాయని, ఈ క్రమంలో ఒకేషనల్ థియరీ, ప్రాక్టీకల్స్ కూడా ఉంటాయని అధికారులు చెప్పారు. ఒకేషనల్ ఎడ్యుకేషన్ కు అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఐటీ, ఫుడ్ ఇండస్ర్టీ, హోమ్ హెల్త్ కేర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, బ్యూటీ థెరఫిస్ట్, టెలీ కమ్యూనికేషన్, బ్యూటీ అండ్ వెల్ నెస్ తదితర అంశాలను ఎంపిక చేశారు.