తెలంగాణ ఉద్యమ గొంతుక సాయిచంద్ : మాల ప్రజా సంఘాల జేఏసీ

తెలంగాణ ఉద్యమ గొంతుక సాయిచంద్ : మాల ప్రజా సంఘాల జేఏసీ

ఓయూ, వెలుగు: ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు వేద సాయిచంద్‌‌‌‌‌‌‌‌ 40వ జయంతి వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో బుధవారం  ఘనంగా జరిగాయి. అంసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మంచాల లింగస్వామి, కో- ఆర్డినేటర్ డాక్టర్ గాజుల ప్రభాకర్, ప్రముఖ  డప్పు కళాకారుడు బాబు కేక్ కట్ చేశారు.

అనంతరం సాయి చంద్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ.. ‘తన ఆట- పాట -మాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉద్యమ గొంతుక సాయిచంద్‌‌‌‌‌‌‌‌ అని అన్నారు.  పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథ కానికి సాయిచంద్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.