
ముషీరాబాద్/వికారాబాద్/చేవెళ్ల/కొడంగల్, వెలుగు : బాగ్లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజీలో గురువారం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఓటర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ ఆవరణలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు ఎలాంటి ఆయుధంగా ఉపయోగపడుతుందో కాలేజీ ఫ్యాకల్టీ స్టూడెంట్లకు వివరించారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓటర్స్ డే సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘ఈవీఎం హటావో భారత రాజ్యాంగం బచావో’ పేరుతో కార్యక్రమం నిర్వహించారు. 18 ఏండ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ఓటర్స్ డే సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయణ, స్వీప్ నోడల్ అధికారి మల్లేశం ఆధ్వర్యంలో కాలేజీ, స్కూల్ స్టూడెంట్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరంకలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి అధికారులు, స్టూడెంట్లతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశంమందిరంలో వయోవృద్ధ ఓటర్లను కలెక్టర్ సన్మానించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో నమో నవమత్ సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి చీఫ్గెస్టుగా హాజరై మాట్లాడారు. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ ఆధ్వర్యంలో కొడంగల్లో ర్యాలీ నిర్వహించారు.