ఢిల్లీ మేయర్ ఎన్నికకు కొనసాగుతున్న ఓటింగ్

ఢిల్లీ మేయర్ ఎన్నికకు కొనసాగుతున్న ఓటింగ్

ఢిల్లీ మేయర్ ఎన్నికకు ఓటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం వార్డు కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటును బ్యాలెట్‭లో ఉంచారు. బీజేపీ ఎంపీలు మీనాక్షి లేఖి, హన్స్ రాజ్ హన్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మేయర్, డిప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తూర్పు పటేల్ నగర్ వార్డు కౌన్సిలర్ షెల్లీ ఒబెరాయ్‌, బీజేపీ నుంచి షాలిమార్ బాగ్-బి వార్డు కౌన్సిలర్ రేఖా గుప్తా పోటీలో ఉన్నారు.

గత రెండు నెలలుగా ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంలో.. ఆప్, బీజేపీ మధ్య వివాదం కొనసాగుతోంది. దీని కోసం మూడుసార్లు ఎన్నిక నిర్వహించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో ఆప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు త్వరగా మేయర్ పదవికి ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. నామినేటెడ్ సభ్యులు ఓటు వేయరాదని సూచించింది. కోర్టు తీర్పుతో నాలుగోసారి వాయిదా పడకుండా మేయర్ ఎన్నికకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు.