ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నిర్లక్ష్యం చేస్తే జైలుకే.. : రాంచందర్

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నిర్లక్ష్యం చేస్తే జైలుకే.. : రాంచందర్

గోదావరిఖని, వెలుగు: ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే  జైలు తప్పదని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్​ వడ్డేపల్లి రాంచందర్ హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్​కు విశేష అధికారాలు ఉన్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎస్సీ, ఎస్టీల విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్, దళిత సంఘాల ఆధ్వర్యంలో రాంచందర్​ను ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో దళిత సంఘాల బాధ్యులు బొంకూరి మధు, మామిడిపల్లి బాపయ్య, రాయమల్లు, లంక సదయ్య, కొంకటి లక్ష్మణ్, కాంపల్లి సతీశ్‌‌‌‌, లింగయ్య, పాల రాజేశం, పులిమోహన్, అంతోటి నాగేశ్వరరావు, అడక పురం చంద్రమౌళి, వడ్డేపల్లి శంకర్, రావుల రాజేందర్​, తదితరులు పాల్గొన్నారు. కాగా సింగరేణి భూనిర్వాసిత ప్రభావిత గ్రామాల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి భూనిర్వాసిత ప్రభావిత గ్రామాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనగామ శంకర్, రాసమల్ల రవికుమార్.. రాంచందర్​కు వినతిపత్రం అందజేశారు.