ఎగుమతుల పెంపు కోసం వాల్‌‌‌‌మార్ట్ గ్రోత్ సమ్మిట్

ఎగుమతుల పెంపు కోసం వాల్‌‌‌‌మార్ట్ గ్రోత్ సమ్మిట్

హైదరాబాద్, వెలుగు : భారతదేశం నుంచి వస్తువుల ఎగుమతులు పెంచడమే లక్ష్యంగా   గ్రోత్ సమ్మిట్ ను  ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14,15 వ తేదీల్లో నిర్వహించనున్నట్లు వాల్‌‌‌‌మార్ట్ తెలిపింది.   రిజిస్ట్రేషన్  నవంబర్ 9 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ఉంటుంది. 

రెండు రోజుల ఈ ఈవెంట్‌‌‌‌లో భారతీయ కంపెనీలు, యునైటెడ్ స్టేట్స్ నుంచి అనేక మంది వాల్‌‌‌‌మార్ట్ కొనుగోలుదారులు కలిసి ఎగుమతి కోసం తమ ఉత్పత్తులను అంచనా వేస్తారన్నారు. 2027 నాటికి భారతదేశం నుంచి ఏటా పది బిలియన్ల డాలర్ల వస్తువులను పొందాలనే టార్గెట్​తో పనిచేస్తున్నామని వాల్​మార్ట్​ తెలిపింది.