హైదరాబాద్, వెలుగు : భారతదేశం నుంచి వస్తువుల ఎగుమతులు పెంచడమే లక్ష్యంగా గ్రోత్ సమ్మిట్ ను ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 14,15 వ తేదీల్లో నిర్వహించనున్నట్లు వాల్మార్ట్ తెలిపింది. రిజిస్ట్రేషన్ నవంబర్ 9 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ఉంటుంది.
రెండు రోజుల ఈ ఈవెంట్లో భారతీయ కంపెనీలు, యునైటెడ్ స్టేట్స్ నుంచి అనేక మంది వాల్మార్ట్ కొనుగోలుదారులు కలిసి ఎగుమతి కోసం తమ ఉత్పత్తులను అంచనా వేస్తారన్నారు. 2027 నాటికి భారతదేశం నుంచి ఏటా పది బిలియన్ల డాలర్ల వస్తువులను పొందాలనే టార్గెట్తో పనిచేస్తున్నామని వాల్మార్ట్ తెలిపింది.