చైనాతో వివాదం ముగిసిపోవాలని కోరుకుంటున్నాం

చైనాతో వివాదం ముగిసిపోవాలని కోరుకుంటున్నాం

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ చెప్పారు. విజయదశమి సందర్భంగా చైనా బార్డర్‌‌కు సమీపంలో సిక్కింలో డిఫెన్స్ వెపన్స్‌‌కు ఆయుధ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్‌‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ‘భారత రక్షణ కోసం ధైర్యవంతులైన చాలా మంది సైనికులు ప్రాణత్యాగాలు చేశారు. సరిహద్దుల్లో ఇండో-చైనా వివాదం, ఉద్రిక్తతలకు ఎండ్ కార్డ్ పడాలని మేం కోరుకుంటున్నాం. కానీ అక్కడ కొన్ని అసహ్యకరమైన పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, మన జవాన్లు భారత భూభాగం నుంచి ఒక్క ఇంచు భూమిని కూడా బయటకు పోనివ్వరు. దేశ సైనికుల ధైర్య, సాహసాలను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’ అని రాజ్‌‌నాథ్ చెప్పారు.

మరిన్ని వార్తలు