
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ర్ట మార్కెటింగ్ శాఖ కమిషనర్, డైరెక్టర్ సురేంద్ర మోహన్ఆఫీసర్లను ఆదేశించారు. మంగళవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ను ఆయన సందర్భించారు. పంట ఉత్పత్తుల గిట్టుబాటు ధరలను రైతుల ద్వారా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సురేంద్ర మోహన్ మాట్లాడుతూ మార్కెట్లోని యార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు సీసీ కెమెరాలు అత్యాధునిక టెక్నాలజీతో త్వరలో తగు ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆయనను ఛాంబర్ ఆఫ్కామర్స్ ప్రెసిండెంట్ బొమ్మినేని రవీందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులతో కలిసి సన్మానించి, మార్కెట్ యార్డుల్లోని సమస్యలను వివరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్శాఖ ఆఫీసర్లు వి.శ్రీనివాస్, పద్మావతి, అనురాధ, సురేఖ, జీ రెడ్డి, రాము, అంజిత్ రావు, ఛాంబర్ కార్యవర్గ సభ్యులు తదితరులున్నారు.