కరోనాతో ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్

కరోనాతో ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్

వరంగల్ జిల్లా ఎంజీఎం ల్యాబ్ టెక్నీషియన్ రవిశంకర్ కరోన తో ఎంజీఎం లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరంగల్ అర్బన్ కు చెందిన రవిశంకర్..ఎంజీఎం లో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల కిందట కరోనా భారిన పడటంతో అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. రవిశంకర్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులు, ఉద్యోగ సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. కనీసం ఉద్యోగ భద్రత కూడా తమకు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. చనిపోయిన రవిశంకర్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.