మద్దూరు, వెలుగు :నారాయణ పేట జిల్లా ఉమ్మడి మద్దూరు మండలంలో నేటి నుంచి ఈ నెల 9 వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ చేస్తున్నట్టు మహబూబ్ నగర్ మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.మండలంలో రోడ్డు వైడెనింగ్ కారణంగా మిషన్ భగీరథ పైప్ లైన్లు తొలగించి సరిచేస్తున్న నేపథ్యం లో నీటి సరఫరా కు అంతరాయం కలుగనున్నట్లు వివరించారు.
