ముంబై: ‘ప్రస్తుతం లోక్సభలో 81మంది మహిళా ఎంపీలం ఉన్నం.. త్వరలో ఆ సంఖ్య 181కి పెరుగుతుంది’ అని బీజేపీ ఎంపీ, ప్రముఖ బాలివుడ్ నటి హేమా మాలిని అన్నారు. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు హేమా మాలిని మద్దతు తెలిపారు.
ఈ బిల్లును లోక్ సభ లో ప్రవేశపెట్టిన సెప్టెంబర్ 19 చరిత్రాత్మ క రోజుగా మారిందని పేర్కొన్నారు. ‘ఈ బిల్లు ఆమోదం తర్వాత మా సంఖ్య దాదాపు 181 అవుతుంది. దాంతో మహిళా ప్రాతినిధ్యం ఇంకా పెరుగుతుం ది. మహిళలకు ఆకాశమే హద్దు. ఇంకా చాలా మంది ముందుకు రావాలి’ అని హేమా మాలిని అన్నారు.