
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్పై మంత్రి ఉత్తమ్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తమకే అర్థం కాలేదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉందని, ఆయన తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లోనే మాట్లారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన చిట్చాట్చేశారు. మంత్రి మాట్లాడింది సభలో ఉన్న తమకే అర్థం కావడం లేదని ఇక ప్రజలకు ఏం అర్థమవుతుందని నిలదీశారు. కాగా, సోమవారం ఉదయం సభలో ఎదురు పడిన కాంగ్రెస్ఎమ్మెల్యే వేముల వీరేశంను కేటీఆర్ పలకరించారు. వీరేశం అన్న భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన విషయం మర్చిపోయారా అని కేటీఆర్అన్నారు. వీరేశం స్పందిస్తూ.. భగీరథ నీళ్లు ఇంటింటికీ రావడం లేదని చెప్పారు.