మాకు రాజకీయాలు తెలియదు.. అవినీతి అంతం చేయడమే తెలుసు

మాకు రాజకీయాలు తెలియదు.. అవినీతి అంతం చేయడమే తెలుసు

తమకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు కానీ.. అవినీతిని అంతం చేయడం మాత్రం తెలుసన్నారు అరవింద్ కేజ్రీవాల్.  తిరంగ ర్యాలీ పేరుతో దేశ వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ రోడ్ షోలు నిర్వహిస్తోంది.హిమాచల్ ప్రదేశ్ మండిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారీ తిరంగయాత్రలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తదితరులు పాల్గొని రోడ్ షో నిర్వహించారు. 
ఈ సందర్బంగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మాట్లాడుతూ ఢిల్లీ రాష్ట్రంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించామన్నారు. పంజాబ్ రాష్ట్రంలో 10రోజుల్లోనే అవినీతిని అంతం చేశామన్నారు. హిమాచల్ ప్రదేశ్  లో అవినీతిని సమూలంగా ఊడ్చే సమయం వచ్చిందన్నారు కేజ్రీవాల్.

 

ఇవి కూడా చదవండి

నిర‌న‌స సెగ ఢిల్లీకి తాకాల‌నే రాస్తారోకోకు పిలుపునిచ్చాం

కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా ? 

షాంఘైలో కరోనా కలకలం.. లాక్డౌన్ పెట్టినా తగ్గని కేసులు

పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్

ఆడపిల్ల పుట్టిందని సంబురాలు.. హెలికాప్టర్లో ఇంటికి