మాకు కాంగ్రెస్ క్లియరెన్స్​ అక్కర్లేదు : అఖిలేశ్ యాదవ్

మాకు కాంగ్రెస్ క్లియరెన్స్​ అక్కర్లేదు : అఖిలేశ్ యాదవ్
  • 16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ చీఫ్​ అఖిలేశ్ యాదవ్

న్యూఢిల్లీ: ఇండియా కూటమికి మరో షాక్​తగిలింది. కూటమిలోని సీట్ల పంపకాలు ఇంకా తేలకముందే.. ఉత్తరప్రదేశ్​లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్​అఖిలేశ్​యాదవ్16 మందితో ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అంతటితో ఆగకుండా అభ్యర్థుల ప్రకటనకు కాంగ్రెస్ నుంచి తమకు ఎలాంటి క్లియరెన్స్ అవసరం లేదని ప్రకటించారు.

యూపీలో తమకు పొత్తు కావాలంటే, సమాజ్ వాదీ పార్టీ ఏమి ఆఫర్ చేస్తుందో వారు అంగీకరించాలని కాంగ్రెస్‌‌కు పరోక్ష సందేశం పంపారు. 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌‌లో యాదవ్ కాంగ్రెస్‌‌కు 11 సీట్లు ఆఫర్ చేశారు. 2019లో మాయావతి బీఎస్పీతో పొత్తు పెట్టుకుని, సమాజ్ వాదీ పార్టీ అమేథీ, రాయ్ బరేలీ నుంచి పోటీ చేయలేదు. కాగా సోమవారం ప్రకటించిన అభ్యర్థుల్లో ఎస్పీ అధినేత భార్య డింపుల్ యాదవ్  ను మెయిన్‌‌పురి నుంచి అభ్యర్థిగా ప్రకటించారు.