V6 News

జనగణనలో భాగస్వాములు కావాలి: కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

జనగణనలో భాగస్వాములు కావాలి: కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, వెలుగు: జనగణనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని  కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. ‘మన జనాభా గణన– - మన అభివృద్ధి' అనే నినాదంతో జనాభా గణన 2027కు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన ఫ్లెక్సీలను కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనాభా గణన దేశంలో అతిపెద్ద ప్రజల భాగస్వామ్య కార్యక్రమమని, ప్రతి ఇంటి సమాచారం నమోదు చేసుకోవడం అందరి బాధ్యతని స్పష్టం చేశారు.

తొలి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా, గణన చేపడతారని వివరించారు. దీనికి ముందు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వీయ గణన (సెల్ఫ్​ ఎన్యుమరేషన్) చేయాలని సూచించారు. దీనికోసం(se.census.gov.in) వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో స్వీయ గణన ఐడీ పొందాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి రాందత్తా రెడ్డి, జిల్లా సెన్సస్ అధికారి తిరుపతి పాల్గొన్నారు.