- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: పాతబస్తీ బేగంబజార్ సమీపంలో నిర్మిస్తున్న మోడల్ ఫిష్ మార్కెట్ పనులు దాదాపు పూర్తయ్యాని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. రూ. 9 కోట్లతో నిర్మిస్తున్న ఫిష్ మార్కెట్ ను త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. శనివారం ఫిష్ మార్కెట్ పనుల ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే రాజసింగ్ తో పాటు అధికారులతో మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కొత్త ఫిష్ మార్కెట్లో స్థానిక వ్యాపారులకే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు మంత్రి తలసాని.
ఇవి కూడా చదవండి
IAS, IPS అధికారులకు పదోన్నతి
కేరళ సెంట్రల్ జైలులో 262 మంది ఖైదీలకు కరోనా