సికింద్రాబాద్లో లక్ష మెజార్టీతో గెలుస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  సికింద్రాబాద్లో లక్ష మెజార్టీతో గెలుస్తాం  :   మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాబోయే పదేళ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉంటుందని  మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ లోక్​సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో కాంగ్రెస్​ గెలుస్తుందన్నారు.  సికింద్రాబాద్​ ఎంపీ సీటును లక్ష మెజారిటీ గెలిచి దానం నాగేందర్​ను లోక్​ సభకు పంపుతామన్నారు. అధికారం పోయిన మూడు నెలలకే బీఆర్​ఎస్​ పతనం మొదలైందన్నారు. దేశంలో ఏ  ప్రాంతీయ పార్టీ ఇంత తక్కువ టైంలో దెబ్బతినలేదని ఆయన అన్నారు. 

ఎంపీ ఎన్నికల్లో సిటీ పరిధిలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.  సికింద్రాబాద్​కు, తెలంగాణకు కేంద్ర మంత్రిగా కిషన్​రెడ్డి చేసిందేమీ లేదన్నారు. మూసీ నది ప్రక్షాళనను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 40 నుంచి 50 వేల కోట్లతో మూసీ నదిని అభివృద్ధి చేస్తామన్నారు.  సూపర్​ గేమ్​ చేంజర్​గా ట్రిపుల్​ ఆర్  మారనున్నదని ఆయన అన్నారు. ట్రిపుల్​ ఆర్ పనులను త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.

ALSO READ :- Vijay Deverakonda: ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డుని అమ్మేసిన విజయ్..ఆ వచ్చిన డబ్బు ఏం చేశాడో తెలుసా?