వాతావరణ జ్యోతిష్యం : జూలై 15లోపు ఏపీ, ఒడిశాల్లో తుఫానులు వస్తాయా..?

వాతావరణ జ్యోతిష్యం : జూలై 15లోపు ఏపీ, ఒడిశాల్లో తుఫానులు వస్తాయా..?

శ్రీ విశ్వావశు నామ సంవత్సరంలో..  2025 జూన్​22న సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటి నుంచి వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఇది శాస్త్రం చెప్పే సత్యం.  గ్రహాల గమనం ఆధారంగా.. ఈ ఏడాది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వర్షాలు పడనున్నట్లు జ్యోతిష్యం చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు పడనుండగా.. మరికొన్ని చోట్ల చాలా తక్కువుగా వర్షపాతం ఉంటుందని వాతావరణ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారంగా జూలై 15వ తేదీ లోపు.. అంటే మరో 25 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీర ప్రాంతాల్లో.. తుఫానులు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు పండితులు. దీనికి కారణం లేకపోలేదు. ఇప్పుడు ఆ కారణాలు తెలుసుకుందాం. . .

 చంద్రుడు ..పూర్వాషాఢ నక్షత్రంలో ప్రవేశించి...  శని వక్రమార్గంలో తిరోగమనం.. కర్కాటక రాశిలో  కుజుడు, కేతువు యోగ ప్రభావంతో ఉత్తరాఖండ్​.. హిమాచల్​ ప్రదేశ్​ లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది.  ఇక జులై 28  న కుజుడు సింహరాశిలోకి వెళతాడు.  అప్పటి వరకు  దక్షిణ మధ్యప్రదేశ్​లోని  విదర్భ ప్రాంతం.. గుజరాత్​ లో  మరాఠీ మాట్లాడే సౌరాష్ట్ర.. మరియు కచ్​ ప్రాంతాల్లో వర్షపాతం తక్కువుగానమోదయ్యే అవకాశం ఉంది.  జూలై 28 నుంచి  సెప్టెంబర్ 13 వరకు  కన్యారాశిలో కుజుడు సంచరిస్తాడు. ఈ  సమయంలో కర్ణాటకలో ఓ మోస్తరు  వర్షాలు కురుస్తాయని వాతావరణ జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

చంద్రుడు పొడి రాశి లగ్నంలో ...  సూర్యుడు ఆరుద్ర  నక్షత్రంలోకి ప్రవేశించే సమయంలో  తక్కువ వర్షపాతం ఉంటుంది.  అయితే  చంద్రుడు ... కర్కాటకం, వృశ్చికం, మకరం .. మీనం వంటి నీటి రాశిలలో సంచరించే సమయంలో కుండపోత వర్షాలు కురుస్తాయి.  వృషభం.. తుల .. కుంభరాశిలో  సాధారణ వర్షపాతం ఉంటుంది.

జూన్ 27న పుష్యమి  నక్షత్రంలో చంద్రుడు బుధునితో మిళితమవువుతాడు.  ఆ సమయంలో  ఉత్తరప్రదేశ్ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.   జూలై 2న చంద్రుడు ... హస్త నక్షత్రంలోకి ప్రవేశించిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ-లో... . జూలై 5న చంద్రుడు స్వాతి నక్షత్రంలో కి ప్రవేశించినప్పుడు... జూలై 7న చంద్రుడు అనురాధ నక్షత్రంలో ఉన్నప్పుడు ఢిల్లీ..పంజాబ్ ..  హర్యానాలలో కూడా మంచి వర్షాలు పడతాయి.. జూలై 12న  చంద్రడు..శ్రవణ నక్షత్రంలో కి ప్రవేశిస్తాడు. రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు మధ్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తాయి. జూలై 16న సూర్యుడు.. కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత..  రుతుపవనాలు దేశంలో చాలా ప్రాంతాల్లో విస్తరిస్తాయి. 

వాతావరణ జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం... 2025 జూన్​.. సెప్టెంబర్​ నెలల మధ్య కాలంలో వర్షపాతం సాధారణం కంటే తక్కువుగా  గతేడాది కంటే  90 నుంచి 95 శాతం) నమోదవుతుంది.  అయితే వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది (2025) వర్షాకాలంలో 106 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.   ఎవరి అంచనాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయో వేచి చూడాలి. . .

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.