
హైదరాబాద్, వెలుగు : చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించాలంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. వారి పార్టీలో మహిళల భాగస్వామ్యం ఎంతో చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టిన బీఆర్ఎస్కు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతికహక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
Also Raed :- రీకౌటింగ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి విజయం
బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఉంటే.. దాన్ని 22 శాతానికి తగ్గించి బీసీలను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ది అని విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని ఎమ్మెల్యే సీట్లను మహిళలకు, బీసీలకు కేటాయించారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు విశ్వకర్మ జయంతి సందర్భంగా బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి బీజేపీ స్టేట్ ఆఫీసు వరకు లక్ష్మణ్ బైక్ ర్యాలీ నిర్వహించారు.