మోడీ ఏం తప్పు చేశారని ఓడించాలి: రాందేవ్ బాబా

మోడీ ఏం తప్పు చేశారని ఓడించాలి: రాందేవ్ బాబా

సొంతిల్లు, పిల్లలు లేని ప్రధాని నరేంద్ర మోడీని గెలిపిస్తే తప్పేంటని ప్రశ్నించారు ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా. 17వ సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఓడించేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమైయ్యాయి.  అయితే… రాందేవ్ మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు.

అసలు ఏం తప్పు చేశారని మోడీని ఓడించాలంటున్నారని ప్రశ్నించారు. దేశ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. ఆయనకు ఇల్లు లేదు, కుటుంబం లేదు. సొంత ప్రయోజనాలు అసలే లేవు. అలాంటి వ్యక్తికి అందరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు రాందేవ్.

నరేంద్ర మోడీ మళ్లీ అధికారం చేపట్టకుండా ఉండడానికి వ్యతిరేక శక్తులైన కొన్ని ముస్లిం, క్రైస్తవ దేశాలు కోట్ల రూపాయలు పంపిస్తున్నాయని ఆరోపించారు. మోడీ ప్రధాని అయితేనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. అన్ని వర్గాలకు మోడీ నాయకత్వంలోనే భరోసా ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీకి మద్దతుగా రాందేవ్ బాబా.. జైపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.