జంగం చెరువుకు పూర్వ వైభవం తీసుకువస్తా :  విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జంగం చెరువుకు పూర్వ వైభవం తీసుకువస్తా :  విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల, వెలుగు: కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్ట్ పనులతో ఖాళీగా మారిన జంగం చెరువుకు పూర్వ వైభవం తీసుకువస్తానని విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. పెగడపల్లి మండలం నామాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెగా కంపెనీ నిర్వహిస్తున్న కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్ట్  పైప్ లైన్ పనుల కోసం జంగం కుంట చెరువు ను ఖాళీ చేయడంతో రైతులు తమ ఇబ్బందులు విప్​దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన జంగం చెరువును శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగం కుంట చెరువు కింద సుమారు 200 ఎకరాల భూమి సాగవుతుందన్నారు.  రెండు రోజులుగా కంపెనీ నిర్వాహకులు తెలిసో, తెలియకనో చెరువులోని నీటిని ఖాళీ చేసినట్లు తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రాగా అధికారులతో కలిసి మెగా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడినట్లు చెప్పారు.

గత ప్రభుత్వంలో లింక్ 2 కింద వెల్గటూర్, పెగడపెల్లి మండలల్లో రూ.లక్షల విలువ చేసే భూములను కేవలం రూ. 7 నుంచి 8 లక్షలు ఇచ్చి సేకరించారని ఇతర నియోజకవర్గాల్లో ఎకరాకు రూ. 23 లక్షలు ఇచ్చారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ పాలకులు ఇక్కడి భూములకు ఎందుకు రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పెంచి రైతులకు న్యాయం చేయలేదని విమర్శించారు.