బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  వైట్ ఫంగస్

బీహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  వైట్ ఫంగస్

పాట్నాలో 4 కేసులు నమోదు 
 బ్లాక్ ఫంగస్ కన్నా  డేంజర్ అంటున్న నిపుణులు  

పాట్నా: కరోనా నుంచి కోలుకున్నవాళ్లను ఇప్పటికే బ్లాక్ ఫంగస్ వణికిస్తుండగా.. ఇప్పుడు వైట్ ఫంగస్ అనే మరో మహమ్మారి మొదలైంది. బీహార్ రాజధాని పాట్నాలో నలుగురికి వైట్ ఫంగస్ సోకినట్లు డాక్టర్లు ప్రకటించారు. బాధితుల్లో ఒకరు ఫేమస్ డాక్టర్ కూడా ఉన్నారన్నారు. లంగ్స్‌‌‌‌తో పాటు కిడ్నీలు, బ్రెయిన్, నోరు, గోళ్లు, చర్మం, కడుపు, ప్రైవేట్ పార్ట్స్ కు కూడా సోకుతుందని, అందుకే ఇది బ్లాక్ ఫంగస్ కంటే చాలా డేంజర్ అని చెప్తున్నారు.  ప్రస్తుతానికి నాలుగు కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయని, వాస్తవానికి ఇంకా చాలా మందికి వైట్ ఫంగస్ సోకి ఉండొచ్చని పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు చెందిన మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ చీఫ్​ డాక్టర్ ఎస్ఎన్ సింగ్ వెల్లడించారు. 
వీరికే రిస్క్ ఎక్కువ.. 
ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నోళ్లు, షుగర్, ఎయిడ్స్ పేషెంట్లు, కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నోళ్లకు వైట్ ఫంగస్ ఎక్కువగా సోకుతోందని డాక్టర్ ఎస్ఎన్ సింగ్ చెప్పారు. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ సిలిండర్లను వాడుతున్నప్పుడు నిర్లక్ష్యం చూపడం వల్లే వారిని వైట్ ఫంగస్ బారిన పడేలా చేస్తోందన్నారు. ఆక్సిజన్ సిలిండర్‌‌‌‌కు అటాచ్ చేసే హ్యూమిడిఫయర్‌‌‌‌లో సెలైన్ వాటర్ కాకుండా ట్యాప్ వాటర్ వాడటమే దీనికి కారణమన్నారు. ఆక్సిజన్ సపోర్ట్ పై ఉండే పేషెంట్లకు వైట్ ఫంగస్ సోకితే చెస్ట్ ఇన్ఫెక్షన్ వస్తోందని తెలిపారు. సీటీ స్కాన్, ఎక్స్ రే ద్వారా  వైట్ ఫంగస్‌‌‌‌ను గుర్తించవచ్చన్నారు.