రాజధానిని మార్చే అధికారం మీకు ఎవరిచ్చారు: చంద్రబాబు

రాజధానిని మార్చే అధికారం మీకు ఎవరిచ్చారు: చంద్రబాబు

రాజధానిని మార్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ సీఎం జగన్ ని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దేశ చరిత్రలో రాష్ట్ర రాజధానిని మార్చిన ఘటనలు ఎప్పుడైనా జరిగాయా అన్నారు. అడ్మినిస్ట్రేషన్ ను విస్తరించి… అభివృద్ధి అంటే అయిపోదన్నారు. జగన్ ఏడు నెలల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖపై అంతప్రేమ ఉంటే అక్కడ డేటా సెంటర్ రాకుండా వైసీపీ నేతలు ఎందుకు అడ్డుపడ్డారని ప్రశ్నించారు చంద్రబాబు. ఆ సెంటర్ ఇక్కడ ఏర్పాటై ఉంటే నాలుగైదేళ్లలో హైదరాబాద్ స్థాయికి వెళ్లేదన్నారు. ఫార్చూన్ 500 కంపెనీలకు కేంద్రంగా విశాఖను తయారు చేయాలని తన హయాంలో భావించి ముందుకెళ్లానని… ఇలాంటివి జరిగితే అభివృద్ధి జరిగిందని చెప్పుకోవచ్చని అన్నారు చంద్రబాబు.