
ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటనలో భారతదేశంలో జన్మించిన US స్టేట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి సీక్రెట్ రికార్డులను దాచినందుకు అలాగే చైనా అధికారులను కలిసినందుకు అరెస్టు అయ్యారు. ఈ విషయాన్నీ వర్జీనియాలోని ఒక ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన లీగల్ అఫిడవిట్లో తెలిపారు. అక్టోబర్ 13న US నిపుణుడు, స్టేట్ డిపార్ట్మెంట్లో సీనియర్ సలహాదారు అయిన ఆష్లే టెల్లిస్పై ఈ అభియోగాలు మోపారు.
ఆష్లే టెల్లిస్ పై ఆరోపణలు: ఆష్లే టెల్లిస్ ఎలాంటి అనుమతి లేకుండా జాతీయ రక్షణ సమాచారాన్ని దాచాడని అలాగే చైనా ప్రభుత్వ అధికారులతో చాలాసార్లు కలిసాడని కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఆష్లే టెల్లిస్ ఎవరు: భారతదేశంలో జన్మించిన 64 ఏళ్ల ఆష్లే టెల్లిస్ అమెరికా విదేశాంగ శాఖలో కీలక వ్యక్తి. ఆయన 2001 నుండి అమెరికా శాఖకు సలహాదారుగా పనిచేస్తున్నారు. 2000 మధ్యలో జరిగిన అమెరికా-భారత్ పౌర అణు ఒప్పంద చర్చలలో ఆయన కీలక పాత్ర పోషించారు.
మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో కూడా టెల్లిస్ సీనియర్ పదవుల్లో పనిచేశారు. సమాచారం ప్రకారం, 2008లో కుదిరిన బుష్ ప్రభుత్వ హయాంలో భారతదేశంతో పౌర అణు ఒప్పందాన్ని చర్చించడంలో టెల్లిస్ కీలక పాత్ర పోషించారు. ఈ ఒప్పందం ఇప్పటికీ ప్రపంచంలోని రెండు అతిపెద్ద దేశాలను బలోపేతం చేసిన ఒక మలుపుగా పరిగణిస్తారు.
అమెరికా సుంకాలపై ఆష్లే టెల్లిస్: ఈ ఏడాది మేలో పహల్గామ్ దాడి తర్వాత ఇండియా-పాకిస్తాన్ వివాదాన్ని పరిష్కరించినందుకు తనకు క్రెడిట్ లభించకపోవడంతో ట్రంప్ మోసపోయినట్లు భావించారని టెల్లిస్ చెప్పారు.
ఆష్లే టెల్లిస్పై వచ్చిన ఆరోపణలు: కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్లో సీనియర్ ఫెలోగా, టాటా స్ట్రాటజిక్ అఫైర్స్ చైర్గా ఉన్న టెల్లిస్ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని రహస్య డాకుమెంట్స్ ఆయన తన దగ్గర పెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ALSO READ : అకస్మాత్తుగా 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ స్టాక్.. డోన్ట్ వర్రీ ఇన్వెస్టర్స్, ఇదే అసలు విషయం..
రక్షణకు సంబంధించిన డాకుమెంట్స్ అనుమతి లేకుండా పెట్టుకోవడం లేదా దాచుకోవడాన్ని నిషేధించే అమెరికా చట్టం 18 USC § 793(e)ను టెల్లిస్ ఉల్లంఘించారని ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు.
యూఎస్ న్యాయవాది లిండ్సే హాలిగన్ ఒక ప్రకటనలో ఈ ఆరోపణలను ప్రకటించారు. టెల్లిస్ చేసినట్టుగా చెబుతున్న ఈ పని మన పౌరుల భద్రతకు, రక్షణకు పెద్ద ముప్పు కలిగిస్తుందని ఆమె అన్నారు.
యాష్లే టెల్లిస్ దోషిగా తేలితే: ఈ నేరం రుజువైతే, టెల్లిస్ 2 కోట్లకు పైగా జరిమానాతో 10 సంవత్సరాల వరకు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇందులో ప్రమేయం ఉన్న సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం కూడా ఉంటుంది. టెల్లిస్పై వచ్చిన ఫిర్యాదు ఈ దశలో కేవలం ఒక ఆరోపణ మాత్రమే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అతను దోషి అని నిరూపించబడలేదు, చట్టం ప్రకారం కోర్టు తీర్పు చెప్పేవరకు అతను నిర్దోషిగానే ఉంటాడు.