
పండుగ వచ్చిందంటే చాలు.. జనాలు కొత్త బట్టలు.. నగలు.. కొత్త అల్లుళ్లు.. అత్తగారింటికి వెళ్లడం..ఒకటేమిటి.. ఇలా ప్రతి పండుగకే ఏదో ఒక హడావిడి ఉంటుంది. కానీ శివరాత్రి పండుగ రోజు కొత్త బట్టలు...అంటే ఓ పంచ .. కండువాతో మాత్రమే సరిపెట్టుకుంటారు. ఇతర నగలు ఏమీ కొనరు.. దీనికి పురాణ ఓ పురాణ కథ కూడా ఉంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. . .
శివరాత్రి వచ్చిందంటే చాలు.. హిందువులందరూ శివాలయాలకు వెళ్లి అభిషేకం చేయడం .. ఉపవాస దీక్ష.. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడం లాంటివి చేస్తుంటారు. శివరాత్రి పండుగకు మాత్రం పూజలు చేయడంలో నిమగ్నమై ఉంటారు. బంగారం లాంటి విలువైన వస్తువులు ధరించినా.. అందంగా ఉండే బట్టలు కట్టుకున్నా,, ధ్యాస అంతా శివుడిపైనే ఉంటుంది. అంతే కాదు శివరాత్రి రోజు కొత్తగా బంగారం కొంటే ఆకలితో అలమటిస్తారనే శాపం కూడా ఉందంట..
పండిత పుత్ర పరమ సుంఠ అనే సామెత ప్రకారంగా.. గుణనిధి చదువులోఆశ్రద్ద చూపి అల్లరి చిల్లరగా తిరుగుతూ.. చెడు వ్యసనాలకు బానిసవుతాడు. దొంగతనాలు చేస్తూ.. .జూదం ఆడుతూ కాలక్షేపం చేసేవాడు. శివరాత్రి పర్వదినాన ఇంట్లో బంగారం దొంగతనం చేసి.. దానిని కల్లు అమ్మే వాడికి ఇచ్చి మద్యం తాగి.. మాంసం తిని ఒళ్లు తెలియని పరిస్థితిలో ఉన్నాడు. బంగారం వలన శివరాత్రి రోజు దుష్టకార్యానికి పాల్పడ్డాడని.. ఈ విషయాన్ని దివ్య దృష్టితో గ్రహించిన బ్రాహ్మణుడు.. శివరాత్రి రోజున ఎవరూ కొత్తగా బంగారం కొనకూడదని .. పూజకు అవసరమైనవి తప్ప ఏ ఇతర వస్తువులను కొత్తగా కొనకూడదని శాపం ఇచ్చాడంట. అందుకే శివరాత్రి రోజున బంగారం లాంటి వస్తువులు కొనకూడదని పురాణాలు చెబుతున్నాయి.
ఆ తరువాత గుణనిధి ఇంటికి రావడానికి ధైర్యం చాలలేదు. ఏమి చేయాలో దిక్కుతోచక అటూ ఇటూ తిరుగుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆకలి బాధ అతడిని వెంటాడింది. అదే సమయంలో ఒక శివ భక్తుడు వివిధ ఆహార పదార్థాలతో తన పరివారం, మిత్రులతో కలిసి శివాలయానికి వెడుతున్నాడు. ఆహార పదార్థాల సువాసనలు గుణనిధి ఆకలిని అధికం చేశాయి.
ఆలయ ద్వారం దగ్గరే ఉన్న గుణనిధి శివుడి నివేదనను ఆరగించాలన్న ఆరాటంతో గుడిలోకి ప్రవేశించాడు.ఆ తొందరలో నిద్రిస్తున్న ఒకరికి గుణనిధి కాలు తగిలింది. అతడు మేల్కొని గుణనిధిని చూచి దొంగ.. దొంగ అని అరిచాడు. ఆ అరుపులకు భయపడి పారిపోతున్న సమయంలో గుణనిధి కాళ్లు తడబడి గర్భగుడి వెలుపలనున్న నందీశ్వరుని మీద పడ్డాడు. పడటం తోనే అతని తల పగిలి ప్రాణాలు పోయాయి.
ఈ కథ తర్వాత శివరాత్రి పర్వదినాన కొత్తగా బంగారం కొనటం, కొత్త వస్త్రాలు కొనుగోలు చేయటం వంటి వాటికి దూరంగా ఉన్నారంట. అందువల్లే మిగతా పండుగల్లా శివరాత్రి రోజు బంగారం, కొత్త దుస్తులు, కొత్త వాహనాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయటం మానేశారంట. ఇదీ పురాణ కథ. అందుకే ఏ బంగారం, వస్త్రాల వ్యాపారులు సంక్రాంతి, దసరా మాదిరిగా శివరాత్రి ఆఫర్స్ పెట్టరు..