తల్లాడ వెలుగు: సొంతూరికి వెళ్లే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం ఖమ్మం జిల్లా తల్లాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ హరిద్వార్ జిల్లా రాంపూర్ టిక్రి గ్రామానికి చెందిన వందనా దేవి(30), భర్త శివ చోటేలాల్ ఆరేండ్లుగా తల్లాడలో ఐస్ క్రీమ్ తయారు చేసి అమ్ముకుంటూ బతుకుతున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టడం, ఐస్క్రీం అమ్ముకునే మార్గం లేకపోవడంతో సొంతూరు వెళదామని భార్య వందనాదేవి పట్టుబట్టింది. ఇప్పుడే వద్దని కొంతకాలం చూసిన తర్వాత వెళదామని భర్త అన్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థాపం చెందిన వందనాదేవి.. భర్త, పిల్లలు పడుకున్న తర్వాత శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో కిటికీకి కండువాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త చోటేలాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ చెప్పారు. లాక్డౌన్తో డెడ్బాడీని సొంతూరుకు తరలించే వీలు లేకపోవడంతో పంచాయతీ సిబ్బంది, స్థానికుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.