భార్య గొంతుకోసి.. ఇంట్లో పెట్టి పరారైన భర్త

భార్య గొంతుకోసి.. ఇంట్లో పెట్టి పరారైన భర్త
  • పహాడీ షరీఫ్‌ పరిధిలోని శ్రీరాం కాలనీలో ఘటన

హైదరాబాద్‌: రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని పహాడీ షరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. వరలక్ష్మీ అనే వివాహితను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. గొంతుకోసి ఇంట్లో పడేసి బయట నుంచి తాళం ఏసి పరారయ్యాడు. భార్య, భర్తలు ఇద్దరూ తరచూ గొడవపడేవారని, వరలక్ష్మిని అతను తరచూ కొట్టేవాడని స్థానికులు చెప్పారు. భర్తకు భయపడి వరలక్ష్మి స్నేహితుల ఇళ్లలో దాక్కునేది అని చెప్పారు. అయితే రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో వరలక్ష్మీని కత్తితో గొంతు కోసి హత్యచేసి బయట నుంచి తాళం వేసి పారిపోయాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పొలీసులు తాళం తీసి వరలక్ష్మీ మృతదేహాని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నాగరాజు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.