రెండో పెండ్లికి సిద్ధమైన భర్త..న్యాయ పోరాటానికి దిగిన భార్య

రెండో పెండ్లికి సిద్ధమైన భర్త..న్యాయ పోరాటానికి దిగిన భార్య

గండిపేట్, వెలుగు: వివాహం జరిగి ఐదు సంవత్సరాలు కాగా.. రెండో పెండ్లికి సిద్ధమవుతున్న భర్త ఇంటి ఎదుట భార్య న్యాయపోరాటానికి దిగింది. బండ్లగూడ జాగీరు మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధి హైదర్షాకోట్‌‌‌‌ సాయిబాలాజీనగర్‌‌‌‌ కాలనీ రోడ్‌‌‌‌ నెంబర్‌‌‌‌ 4 ఈ ఘటన జరిగింది. కాలనీకి చెందిన శ్రీధర్‌‌‌‌కుమార్, శ్రవంతి ఐదేళ్ల క్రితం లవ్​ మ్యారేజ్​ చేసుకున్నారు. 

ఏడాది తరువాత ఇరువురి కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించి బండ్లగూడలోని దేవాలయంలో తిరిగి వైభవంగా వివాహం జరిపించారు. కొంతకాలం తరువాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. కట్నం కోసం భర్తతో పాటు అత్తామామ వేధించారు. 

అంతేగాకుండా ‘నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపో, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా’ అని భర్త బెదిరింపులకు గురిచేస్తున్నట్లు బాధితురాలు ఆరోపించారు. తపరే న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట తల్లితో కలిసి మైన దీక్ష చేసింది. తనకు పిల్లలు కూడా పుట్టకుండా తరచూ టాబ్లెట్స్‌‌‌‌ వేయించారని వాపోయింది.