త్వరలోనే మేడిగడ్డ సందర్శన : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

త్వరలోనే  మేడిగడ్డ సందర్శన : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ పిల్లర్లు కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటోంది. ఈ విషయంమై ఇవాళ అసెంబ్లీ ఆవరణలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తెప్పించుకుంటున్నామని, త్వరలోనే బ్యారేజీని సందర్శిస్తామని ఉత్తమ్ చెప్పారు. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడుతానని అన్నారు. ఎప్పుడు అక్కడికి వెళ్తామనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.