పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తం : గడ్డం ప్రసాద్ కుమార్

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తం : గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, వెలుగు : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, వికారాబాద్ సెగ్మెంట్​ను రూ. 3 వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేసుకుందామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. బుధవారం బంట్వారంలో  ప్రజాపాలన ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

అర్హులైన ప్రతి ఒక్కరు 6వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో లేని వారికి 4 నెలల తర్వాత మరోసారి దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉంటుందని పేర్కొన్నారు.   కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆలంపల్లి లావణ్య  శ్రీనివాస్, జడ్పీటీసీ కోటిపల్లి సంతోషా రాజు, ఎంపీపీలు ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ పద్మ వెంకటేశ్ , తహసీల్దార్ ప్రవీణ్ కుమార్,  వివిధ గ్రామాల సర్పంచులు,  ఎంపీటీసీలు,  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.