మోడీ సభను గ్రాండ్​ సక్సెస్​ చేస్తం

మోడీ సభను గ్రాండ్​ సక్సెస్​ చేస్తం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం వస్తే ప్రజాస్వామ్య తెలంగాణ అవుతుందనుకుంటే, కల్వకుంట్ల తెలంగాణ అయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో రాష్ట్రం బందీ అయిందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, కనీసం జీతాలకు కూడా నిధులు లేవన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయి, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ముఖ్య నేతల మీటింగ్​జరిగింది. ఇందులో వివేక్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జులైలో హైదరాబాద్ లో నిర్వహించనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై మీటింగ్ లో చర్చించామని చెప్పారు. సమావేశాలకు వచ్చే అతిథులకు అకామిడేషన్, ట్రాన్స్ పోర్టుపై డిస్కస్ చేశామన్నారు. 3న పరేడ్​గ్రౌండ్​లో నిర్వహించనున్న ప్రధాని మోడీ సభకు భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించామన్నారు. సభను గ్రాండ్ సక్సెస్ చేస్తామన్నారు.  బేగంపేట సభలో ప్రధాని మాట్లాడిన మాటలతోనే తెలంగాణ సర్కార్​పై ఆయన ఎంత సీరియస్​గా ఉన్నారో తెలుస్తోందన్నారు. ప్రపంచ దేశాలు ఇండియాలో అద్భుత పాలన జరుగుతోందని మోడీని ప్రశంసిస్తున్నాయని చెప్పారు. ప్రధాని ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటికే గ్రామగ్రామాన ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.