కళాకారులకు అండగా ఉంటం : మంత్రి జూపల్లి కృష్ణారావు

కళాకారులకు అండగా ఉంటం : మంత్రి జూపల్లి కృష్ణారావు

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు అండగా ఉండి కళలను ప్రోత్సహిస్తుందని  పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శృతిలయ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సీఎండీ బండారు సుబ్బారావు ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో మహాత్మాగాంధీ స్ఫూర్తి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

మాజీ ఎంపీ మల్లు రవిని మహాత్మా గాంధీ స్ఫూర్తి అవార్డుతో మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు.