మంచిర్యాల జిల్లాలో గాలివాన బీభత్సం..కేసీఆర్ సభలో చిరిగిపోయిన ఫ్లెక్సీలు 

మంచిర్యాల జిల్లాలో గాలివాన బీభత్సం..కేసీఆర్ సభలో చిరిగిపోయిన ఫ్లెక్సీలు 

మంచిర్యాల జిల్లా జన్నారం (మ) ఇంధన్ పల్లి గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. ఇంటిపై కప్పులు లేచిపోయాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు ఈదురు గాలులకు నేలకొరిగాయి. 

ఉదయం నుండి ముఖ్యమంత్రి సభ కోసం పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 4 గంటల సమయంలో ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చిరిగిపోయి కిందపడ్డాయి. వీటిని సరి చేసేందుకు నానాతంటాలు పడుతున్నారు.