తెలంగాణాలో ఇయ్యాల వైన్స్ క్లోజ్

తెలంగాణాలో ఇయ్యాల వైన్స్ క్లోజ్

హైదరాబాద్, వెలుగు : ఓట్ల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలు నిలిపివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వైన్ షాపులు, బార్లు,  రెస్టారెంట్లు, క్లబ్బులు, స్టార్​ హోటళ్లు మూసివేయాలని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ప్రజలకు ఇబ్బంది కలిగేలా హడావుడి చేయటం, బాణసంచా కాల్చడంపైన కూడా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.