టాటా చేతికి వి​స్ట్రాన్..

టాటా చేతికి వి​స్ట్రాన్..

ముంబై: యాపిల్​ కోసం  ఐఫోన్​తయారు చేసే తైవాన్​ కంపెనీ వి​స్ట్రాన్​ కార్ప్​మన దేశంలోని పెద్ద కార్పొరేట్​గ్రూప్​ టాటా చేతికి రానుంది. ఇది కార్యరూపంలోకి వస్తే ఐఫోన్​ తయారు చేసే మొదటి ఇండియన్​ కంపెనీగా టాటా గ్రూప్​ అవతరిస్తుంది. వి​స్ట్రాన్​ కార్ప్​ కొనుగోలుకు గత కొన్ని నెలలుగా టాటా గ్రూప్​ ప్రయత్నాలు జరుపుతోంది. మార్చి చివరినాటికి ఈ టేకోవర్​ ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్​గా పెట్టుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జాయింట్​ వెంచర్​లో టాటా గ్రూప్​కు మెజారిటీ వాటా ఉండేలా డిస్కషన్స్​ సాగుతున్నట్లు తెలుస్తోంది. మాన్యుఫాక్చరింగ్​ యాక్టివిటీ మొత్తం టాటా గ్రూప్​ అజమాయిషీలోనే నడుస్తుందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం వి​స్ట్రాన్​ కార్ప్​ అవసరమైన సహకారాన్ని మాత్రమే అందిస్తుంది.  తైవాన్​ కంపెనీలయిన వి​స్ట్రాన్​కార్ప్​, ఫాక్స్​కాన్​ టెక్నాలజీ గ్రూప్​లే యాపిల్​కు ఐఫోన్​లను అసెంబ్లింగ్​ చేస్తూ,  అతి పెద్ద సప్లయర్లుగా నిలుస్తున్నాయి. 

చైనాతో పోటీలో ముందడుగు....

ఎలక్ట్రానిక్స్​ రంగంలో చైనాతో పోటీ పడేందుకు గట్టి పోటీదారులను తయారు చేయాలని మన దేశం ప్రయత్నాలు చేస్తోంది. టాటా గ్రూప్​ చేతికి ఐఫోన్​ తయారీ వస్తే ఈ విషయంలో ఒక అడుగు ముందుకు పడినట్లే అవుతుంది. అమెరికాతో  సంబంధాలు చెడిపోవడంతోపాటు, కొవిడ్​ సంబంధ సమస్యలతోనూ చైనా సతమతమవుతోంది. మార్చి 2023 చివరినాటికి డ్యూ డెలిజెన్స్​ ప్రక్రియ పూర్తి చేయాలని టాటా గ్రూప్​లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్స్​ పొందేందుకు వీలైనంత తొందరగా విన్​స్ట్రాన్​ కార్ప్​ను చేజిక్కించుకోవాలనేది టాటా గ్రూప్​ ఆలోచన. ఇండియాలోని వి​స్ట్రాన్​ ఐఫోన్​ మాన్యుఫాక్చరింగ్​ఫెసిలిటీ వాల్యుయేషన్​ 600 మిలియన్​డాలర్లదాకా ఉండొచ్చని అంచనా. టాటా గ్రూప్​ డిస్కషన్స్​పై మాట్లాడడానికి అటు విస్ట్రాన్​, ఇటు యాపిల్​ అంగీకరించలేదు. 
ఇండియాలో మొత్తం మూడు తైవాన్​ కంపెనీలు ఐఫోన్​మాన్యుఫాక్చర్​ చేస్తున్నాయి. వి​స్ట్రాన్​తోపాటు ఫాక్స్​కాన్​, పెగాట్రాన్​ కార్ప్​లు యాపిల్​ కోసం  మన దేశంలో అసెంబ్లింగ్​ యూనిట్లు ఏర్పాటు చేశాయి. ఐఫోన్​ మాన్యుఫాక్చరింగ్​లో మార్జిన్లు తక్కువనే కారణంతో సర్వర్లు వంటి వాటి తయారీకి మళ్లాలనేది వి​స్ట్రాన్​ ప్లాన్​. చైనాలోని ఐఫోన్​ తయారీ యూనిట్​ను 2020లోనే మరో కంపెనీకి వి​స్ట్రాన్​ విక్రయించింది. వి​స్ట్రాన్​ఇండియాలో ఐఫోన్​ మాన్యుఫాక్చరింగ్​ నుంచి తప్పుకోవాలనుకుంటున్నా, మిగిలిన రెండు  తైవాన్​ కంపెనీలు మాత్రం తమ కెపాసిటీలను పెంచుతున్నాయి. మరోవైపు యాపిల్​ కూడా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలని కోరుకుంటోంది. కరోనా కారణంగా ఆ దేశంలో  సప్లయ్​ చెయిన్ దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. 

యాపిల్​తో మరింత బిజినెస్​...

బెంగళూరు సమీపంలోని విస్ట్రాన్​మాన్యుఫాక్చరింగ్​ ఫెసిలిటీ 22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయింది. ఇందులో ఎనిమిది ఐఫోన్​ లైన్లుండగా, పది వేల మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఇండియాలో ఐఫోన్ల తయారీకి సర్వీస్​ పార్ట్​నర్​గా విస్ట్రాన్​ కొనసాగుతుంది. యాపిల్​తో కలిసి పనిచేయడానికి టాటా గ్రూప్​చొరవ తీసుకుంటోంది. ఐఫోన్​ కాంపోనెంట్లు తయారు చేసే తన హోసూర్​ ఫ్యాక్టరీలో చురుగ్గా రిక్రూట్​మెంట్​ నిర్వహిస్తోంది. ఇక్కడ కూడా ఐఫోన్​ మాన్యుపాక్చరింగ్​ లైన్లను భవిష్యత్​లో ఏర్పాటు చేయాలనేది టాటా గ్రూప్​ ఆలోచన. అంతేకాదు, దేశంలో 100 యాపిల్​ స్టోర్లను తేనున్నట్లు టాటా గ్రూప్​ ఇప్పటికే ప్రకటించింది. వీటిలో మొదటి స్టోర్​ను ఈ క్వార్టర్లోనే ముంబైలో తెరవనున్నారు.