
- భర్తతో పాటు అతని కుటుంబసభ్యులపై కేసు
తిమ్మాపూర్, వెలుగు: అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్మండలం అలుగునూర్గ్రామానికి చెందిన స్వప్న(30)కు అదే గ్రామానికి చెందిన గూళ్ల వెంకటేశ్తో పదేండ్ల కింద పెండ్లి అయింది. కట్నకానుకల కింద రూ. 5లక్షల నగదుతో పాటు 10 తులాల బంగారం ఇచ్చారు. అదనపు కట్నం కోసం భర్త వెంకటేశ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు తరచూ వేధింపులకు గురిచేస్తుండగా.. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా తీరు మార్చుకోలేదు.
మూడు నెలల కింద స్వప్న తల్లిగారింటికి వెళ్లింది. నెలరోజుల కింద భర్త వెంకటేశ్వెళ్లి భార్యను తీసుకొచ్చాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆమె చనిపోయింది. కాగా అత్తింటి వేధింపులు భరించలేకే తమ కూతురు చనిపోయిందంటూ మృతురాలి తల్లి పిట్టల అనసూర్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.