కరీంనగర్ జిల్లా అలుగునూర్ లో అత్తింటి వేధింపులతో మహిళ సూసైడ్

కరీంనగర్ జిల్లా అలుగునూర్ లో అత్తింటి వేధింపులతో మహిళ సూసైడ్

 

  • భర్తతో పాటు అతని కుటుంబసభ్యులపై కేసు   

తిమ్మాపూర్​, వెలుగు:  అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.  పోలీసులు తెలిపిన ప్రకారం.. కరీంనగర్​మండలం అలుగునూర్​గ్రామానికి చెందిన స్వప్న(30)కు అదే గ్రామానికి చెందిన గూళ్ల వెంకటేశ్​తో పదేండ్ల కింద పెండ్లి అయింది.  కట్నకానుకల కింద రూ. 5లక్షల నగదుతో పాటు 10 తులాల బంగారం  ఇచ్చారు. అదనపు కట్నం కోసం భర్త వెంకటేశ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు తరచూ వేధింపులకు గురిచేస్తుండగా..  పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా తీరు మార్చుకోలేదు.

మూడు నెలల కింద స్వప్న తల్లిగారింటికి వెళ్లింది. నెలరోజుల కింద భర్త వెంకటేశ్​వెళ్లి భార్యను తీసుకొచ్చాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆమె చనిపోయింది. కాగా అత్తింటి వేధింపులు భరించలేకే తమ కూతురు చనిపోయిందంటూ మృతురాలి తల్లి పిట్టల అనసూర్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ​