భూకబ్జాను అడ్డుకున్నందుకు నా భర్తపై దాడి

భూకబ్జాను అడ్డుకున్నందుకు నా భర్తపై దాడి

ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా అడ్డుకున్నందుకు తన భర్తపై కొందరు దాడి చేశారని.. నల్గొండ జిల్లా కూర్మపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలమ్మ HRCకి ఫిర్యాదు చేసింది. సామాజిక కార్యకర్తగా ఉన్న తన భర్త పెద్ద రామచంద్రం ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా హరితహారం మొక్కలు నాటాడాని చెప్పింది. ఈ నెల 8న కూర్మపల్లి గ్రామానికి చెందిన కొందరు తన భర్తపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆమె HRCకి వివరించింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక చింతపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది శ్రీశైలమ్మ. తన ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లనీ.. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తన భర్త చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నారని కన్నీరు పెట్టుకుంది.