ట్రైన్ లోనే డెలివరీ చేసిన మెడిసిన్ విద్యార్థిని

ట్రైన్ లోనే డెలివరీ చేసిన మెడిసిన్ విద్యార్థిని

సికింద్రాబాద్ - విశాఖ దురంతో ట్రైన్ లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని డెలివరీ చేసింది. శ్రీకాకుళానికి చెందిన గర్భిణికి అనకాపల్లి సమీపంలో పెయిన్స్ వచ్చాయి. వెంటనే అదే భోగీ లో ప్రయాణిస్తున్న వైద్య విద్యార్థిని.....ట్రైన్ లోనే డెలివరీ చేసింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తల్లి బిడ్డలను కాపాడిన వైద్య విద్యార్థినిని అందరూ అభినందించారు.